Saturday, May 12, 2012

రంగులు

వరిచేలు పచ్చగా లేవు
మట్టి దిబ్బలు ఎర్రగా లేవు

ప్రకృతి రంగులన్నిటినీ
దోచేసుకుని రాత్రి
ఎటో పారిపోతోంది

తూరుపు కొండ చాటున
మాటు వేసిన సూర్యుడు
రాత్రి మీద దాడిచేసి
వేటి రంగుల్ని తిరిగి
వాటికే ప్రసాదించాడు

గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!

10 comments:

మధురవాణి said...

Beautiful! :)

Padmarpita said...

వ్వావ్....బహుబాగు :-)

రసజ్ఞ said...

ఇంత బాగా ఎలా వ్రాస్తారు?
గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!అద్భుతమయిన భావన! చాలా బాగుందండీ!
ఇప్పుడు మన హీరో సూర్య (సూర్యుడు) అనమాట ;)

మానస.. said...

wow... AWESOME...!!

ఊకదంపుడు said...

బావుందండీ

జ్యోతిర్మయి said...

గడ్డిపరకల మీద నీటి బిందువులుపై మీ కవిత శాశ్వతంగా నిలిచిపోతుంది.

suresh said...

chala baagundi..simply superb.

Meraj Fathima said...

chaalaa baagundandee manchi bhavukatha undi mee kavithalo

Anonymous said...

అద్భుతమైన భావన...ఎంత సున్నితంగా చెప్పారు!!!
చాలా అందంగా ఉంది..!!
simply beautiful!! :) :)

rākeśvara said...

అక్షరాలు కుమ్మక్కయి తమ వెనుక దాచుకున్న కవితలన్నిటినీ బలే లాగుతున్నారు మా కోసం।